బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2015 (14:29 IST)

శనివారాల్లో శ్రీ వేంకటేశ్వరుడిని ఎలా పూజించాలి?

శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఆయనకు పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. శనివారం పూట ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి. పూజ గదిలో మంగమ్మతో కూడిన వేంకటేశుని ప్రతిమ లేదా ఫోటోను ఉంచి.. ఆయనకు ఎదురుగా కూర్చోవాలి. దీపాలను శుభ్రం చేసుకుని.. పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి. పూజగది, ఇంటి ముందు రంగవల్లికలు తప్పనిసరిగా ఉండితీరాలి.
 
అనంతరం తులసీతో అర్చన చేయాలి. తర్వాత ధూపదీపనైవేద్యాలతో సమర్పించుకోవాలి. పాలు, పండ్లు, పాయసం, కలకండ, చక్కెర పొంగళి వంటివి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి మహాత్మ్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు "ఓం నమో నారాయణా" అనే మంత్రాన్ని జపించాలి. అలాగే సాయంత్రం పూట కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి. 
 
బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపమెలిగించాలి. ఈ బియ్యం పిండి దీపాన్ని ఆరిపోక ముందే చక్కెర పొంగళి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. కర్పూర హారతి ఇవ్వాలి. ఒంటి పూజ భోజనం చేయాలి. పురట్టాసి శనివారాల్లో ఏదైనా ఒకవారం శ్రీవారిని దర్శించుకోవడం.. పై విధంగా పూజ చేయడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది.