ఆలయానికి వెళ్తున్నారా? అయితే ఇలాంటి పనులు చేయకండి! అంటున్నారు పురోహితులు. దైవానికి తోచిన రీతిలో పూజలు చేస్తాం. నిజానికి ఆలయంలో ఎలా మసలు కోవాలి. ఆ పరమాత్మను ఎలా పూజించాలి. ఎలా ప్రదక్షిణలు చేయాలి. ఇలాంటి ఆలోచనలు మనల్ని చుట్టు ముడతాయి. ఈ సందేహాలకు వరాహపురాణంలో పరిష్కారం సూచించారు. ఆ పురాణం ఆధారంగా దేవాలయంలో ఎలాంటి పనులు చేయకూడదో చూద్దాం.
* ఒక చేతితో దైవాన్ని నమస్కరించ కూడదు.
* గుడిలోకి వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు
* గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాక నమస్కరించకుండా ఉండకూడదు.
* దైవ దర్శనం అయ్యాక గుడిలో కూర్చుంటాం. అలా కూర్చునేటప్పుడు భగవంతునికి ఎదురుగా కాళ్ళు చాపడం, వీపును భగవంతుని వైపు పెట్టడం చేయకూడదు.
* ఆలయ మంటపంలో భోజనం చేయకూడదు.
* ఆలయంలో నిద్ర చేయాల్సి వస్తే భగవంతుని ఎదురుగా పడుకోకూడదు.
* ఆలయంలో గట్టిగా మాట్లాడడం, అరవడం, ఏడ్వడం, దెబ్బలాడడం చేయకూడదు.
* ముఖ్యంగా ఉపకారం చేస్తానని ప్రతిజ్ఞ చేయడం కూడదు.
* నిన్నేం చేస్తానో చూడు అని బెదిరించకూడదు.
* స్త్రీలతో పరిహాసంగా మాట్లాడకూడదు.
* కంబళి, శాలువతో కప్పుకుని దైవ దర్శనానికి వెళ్ళకూడదు
* ఇతరులను నిందించకూడదు.
* ఎవరినైనా పొగడడం చేయకూడదు.
* మాంసాహారం తినకూడదు.
* తోటలోనైనా, ఇంట్లోనైనా పండిన పండ్లను, పూచిన పూలను, కూరలను భగవంతునికి సమర్పించకుండా ముందుగా తినకూడదు.
* ఆలయంలో దైవం ముందు ఇతరులకు నమస్కరించకూడదు.
* ఆలయంలో తనను తాను పొగడుకోవడం కూడదు.
* గట్టిగా గంట మోగించకూడదు.
* భగవంతుడిని నిందించకూడదు.
ఆలయంలో ఇలాంటి పనులు చేస్తే భగవంతుని సేవించిన పుణ్యం దక్కకపోవడమే కాదు.. మిక్కిలి పాపం చేసినట్లు అవుతుందని వరాహపురాణం చెబుతోంది.