బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By JSK
Last Modified: శనివారం, 5 నవంబరు 2016 (14:28 IST)

కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం... ఎందుకు వెలిగించాలి?

కార్తీక మాసం... ఆకాశ‌దీపం. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా... శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌ది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వేళ

కార్తీక మాసం... ఆకాశ‌దీపం. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా... శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌ది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వేళాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. 
 
తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు. 
 
ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. ‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమతమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.