శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (13:12 IST)

చెన్నైలో ఛత్రపతి శివాజీ పూజించిన దేవాలయం... కోరిన కోర్కెలు నెరవేరుతాయ్...

తమిళనాడు రాజధాని చెన్నైలోని తంబుశెట్టి వీధి, ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో కొలువై వున్న కాళికాదేవి అమ్మవారు శివపరమాత్మ కమఠేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. క్రీ.శ 1677 అక్టోబరు 3వ తేదీన ఈ తల్లిని దర్శించుకు

తమిళనాడు రాజధాని చెన్నైలోని తంబుశెట్టి వీధి, ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో కొలువై వున్న కాళికాదేవి అమ్మవారు శివపరమాత్మ కమఠేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. క్రీ.శ 1677 అక్టోబరు 3వ తేదీన ఈ తల్లిని దర్శించుకుని పూజలు చేసిన ఛత్రపతి శివాజీ తదనంతరం పలు యుద్ధాల్లో విజయం సాధించాడట. 
 
ఒకప్పుడు సముద్ర తీరాన ఈ ఆలయం వుండేదనీ, ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని ఇక్కడకు మార్చారని చెపుతారు. ఆలయంలో మహావిష్ణు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, నవగ్రహాలతోపాటు అగస్త్యుడు, అంగీరసుడు తదితర మునీశ్వరులున్నారు. ఈ ఆలయంలో దర్శన వేళలు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ. అమ్మను దర్శించుకున్న వారికి కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం.