శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ప్రీతి ఛిఛిలి
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:10 IST)

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శివలింగం... ఎత్తు ఎంతో తెలుసా?

కేరళ రాష్ట్రంలోని చెన్కల్‌లో ఉన్న మహేశ్వరం శివపార్వతి ఆలయంలో అత్యంత ఎత్తయిన శివలింగాన్ని నిర్మిస్తున్నారు. 111.2 అడుగుల ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 సంవత్సరం మోలో మొదలైంది. అంతేకాకుండా ఈ శివలింగం లోపలికి కూడా భక్తులు ప్రవేశించవచ్చు. ఇందులో ఎనిమిది అంతస్తులు ఉంటాయి. మనిషి శరీరంలో ఉండే ఆరు శక్తి కేంద్రాలైన ములధార, స్వదిస్థాన, మణిపుర, అన్హా, విషుద్ధ, అజ్నలను ఒక్కో అంతస్తు సూచిస్తుండగా మొదటి అంతస్తులో 108 శివలింగాలను ప్రతిష్టిస్తున్నారు.
 
ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే శివలింగం ఎగువభాగంలో కైలాసం వలె నిర్మించి, హిమాలయాలతో పాటుగా శివపార్వతుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసారు. అంతేకాకుండా ఇక్కడ భక్తులు 12 జ్యోతిర్లింగాలు, విఘ్ననాథుని 32 రూపాలను ఒకేచోట దర్శించుకోవచ్చు. మఠాధిపతులు మహేశ్వరానంద స్వామి తదితరులు దేశంలోని పలు పుణ్యక్షేత్రాల నుండి మట్టిని సేకరించి ఈ నిర్మాణంలో ఉపయోగించారు.
 
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు ఈ శివలింగం ఎత్తును కొలిచి, భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన శివలింగంగా నమోదు చేసి, గురువారం నాడు అధికారికంగా ప్రకటించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు ఆలయ అధికారులు.