శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2015 (17:26 IST)

నారాయణవనం: అమ్మవారిని పూజిస్తే.. ఆశించిన ఫలితం దక్కుతుందట!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు నారాయణవనానికి వెళ్తుంటారు. శ్రీనివాసుడు.. పద్మావతీదేవిని చూసిందీ.. వారి వివాహం జరిగింది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రం స్వామివారి కల్యాణ ఘట్టాలకు నిలయంగా కనిపిస్తూ వుంటుంది. అందుకే ఇక్కడ శ్రీనివాసుడు కల్యాణ వేంకటేశ్వరుడుగా పద్మావతీదేవి సమేతంగా దర్శనమిస్తుంటాడు. గర్భాలయంలో స్వామివారు కొలువై వుండగా, ప్రత్యేక ఆలయంలో అమ్మవారు కొలువై అనుగ్రహిస్తూ వుంటుంది.
 
అడుగడుగునా అనేక విశేషాలను .. మహిమలను ఆవిష్కరించే ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు. ఈ ఆలయంలో గల అమ్మవారిని పూజించిన వారికి ఆశించిన ఫలితం దక్కుతుందని పురోహితులు అంటున్నారు. వివాహ దోషాలు తొలగిపోతాయి. సర్పదోషాలుండవు అని వారు సూచిస్తున్నారు. ఇంతేకాకుండా ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఈతిబాధలు ఏమాత్రం ఉండబోవు.