గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (17:16 IST)

లేపాక్షిలోని సీతమ్మ పాదాలను స్పర్శిస్తే..?

సీతమ్మ పాదాలు కనిపించే దివ్య క్షేత్రమే అనంతపురం జిల్లాకి చెందిన 'లేపాక్షి'. అనేక విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక కేంద్రంగా లేపాక్షి అలరారుతోంది. అలాంటి లేపాక్షి క్షేత్రంలో ఒకచోట సీతమ్మవారిదిగా చెప్పబడుతోన్న పాదముద్ర కనిపిస్తుంది. 
 
ఇలాంటి పాదముద్రలు చాలా క్షేత్రాల్లో కనిపిస్తుంటాయి. అయితే ఈ పాదముద్ర యొక్క బొటనవ్రేలు భాగం నుంచి నిరంతరం సన్నని నీటిధార వస్తుండటం విశేషం. మండువేసవిలో సైతం ఈ నీటిధార ఆగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.
 
సీతమ్మవారి పాదముద్రను తాకితే ఆ తల్లి ఆశీస్సులు లభించినట్లు భక్తులు భావిస్తుంటారు. ఆ నీటిని స్పర్శించినా, తలపై చల్లుకున్నా, తీర్థంగా స్వీకరించినా పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. 
 
రాముడి వెంట వనవాసానికి బయలుదేరిన సీతమ్మ ఎన్నో ప్రాంతలమీదుగా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. ఆ తల్లి పాదస్పర్శచే ఈ నేల పునీతమైంది. అలాంటి సీతమ్మవారి పాదముద్రను పదిలంగా తన గుండెల్లో దాచుకుని, దర్శించిన భక్తులను ధన్యులను చేస్తోన్న ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూసితీరవలసిందే.