శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 నవంబరు 2014 (19:30 IST)

నాగదోషాలు, గ్రహాది దోషాలు తొలగిపోవాలంటే..?

కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం' ... ఇది కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా పరిధిలో ఉంది. ఇక్కడి స్వామి నెమలి వాహనాన్ని అధిష్టించి ఉండగా, ఆయన సన్నిధిలో ఆదిశేషుడు - వాసుకి దర్శనమిస్తూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో నదీ తీరంలో అలరారుతోన్న ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. 
 
వివాహం విషయంలో సమస్యలు ... అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లు, సంతాన సౌభాగ్యాలను కోరుకునేవారు ఈ స్వామిని దర్శిస్తూ ఉంటారు. స్వామి దర్శనం చేసుకుని ఆయనకి పూజాభిషేకాలు జరిపించి ఆ రాత్రికి అక్కడ నిద్రచేస్తుంటారు.
 
మరునాడు మరలా ఆయన దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతుంటారు. ఈ విధంగా సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో నిద్ర చేయడం వలన నాగదోషాలు ... గ్రహ సంబంధమైన దోషాలు నశించిపోతాయని విశ్వసిస్తుంటారు.