పక్షవాతాన్ని నయంచేసే పవిత్ర స్నానం
సనాతన సంప్రదాయాలకు, ఆచారాలకు భారత దేశం పుట్టినిల్లు. ఈ దేశంలో ప్రజలలో నెలకొన్న నమ్మకాలు, విశ్వాసాలు ఎన్నో అద్భుతాలకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. అలాంటి అద్భుతాల శ్రేణిలో మేమందిస్తున్న ఈ అద్భుతం మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆ అద్భుతమేమిటో తెలుసుకుందాం... రండి.ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండిమధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో " భాడవ మాత " దేవాలయం కొలువై ఉన్నది. భాడవమాత దేవాలయం 700 సంవత్సరాల నాటిదని స్థానికులు విశ్వసిస్తారు. ఇక ఈ దేవాలయానికి గల విశిష్ఠత ఆధునిక వైద్య శాస్త్ర నిష్ణాతులకు సైతం అంతుపట్టనిదిగా ఉన్నది. ఆ విశిష్ఠత ఏమిటంటే... దేవాలయంలోని భావ్డీగా పిలువబడే కొలనులో స్నానమాచరించినట్లయితే పక్షవాతం తదితర వ్యాధులు ఇట్టే మాయమైపోతాయి.
పక్షవాత వ్యాథిగ్రస్తులకు భావ్డీ జలం మంత్ర జలంలా పనిచేసి వారి అనారోగ్యాన్ని మాయం చేస్తుంది. ఇదిలా ఉండగా భావ్డీ మాత దేవాలయం భీల్ గిరిజన తెగకు చెందిన ప్రజల విశ్వాసం నుంచి అవతరించిందని ప్రధాన నిర్వాహకుడు విశ్వనాథ్ గెహ్లట్ మాటల ద్వారా తెలుస్తున్నది. మరింత వింత కలిగించే విషయమేమిటంటే... దేవాలయ ప్రధాన అర్చకులుగా బ్రాహ్మణులకు బదులుగా భేల్ తెగకు చెందినవారు వ్యవహరిస్తుండడం... ఇక దేవాలయ ప్రత్యేకతను గురించి విశ్వనాథ్ గెహ్లాట్ ఇంకా ఏమంటున్నారంటే... " ఎన్నెన్నో అద్భుతాలకు, ఆశ్చర్యపరిచే ఉదంతాలకు దేవాలయం పెట్టింది పేరు. దేవాలయంలోని అతి పురాతనమైన కొలనులో స్నానమాచరించిన పక్షవాత రోగగ్రస్థుల వ్యాధి ఇట్టే నయమైపోతుందని దేవాలయాన్ని సందర్శించే భక్తుల ప్రగాఢ విశ్వాసం." ఆయన ఇంకా ఇలా చెపుతున్నారు... " నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. తమ కోర్కెలు తీర్చమంటూ భక్తులు అశేషంగా దేవాలయాన్ని సందర్శిస్తారు.మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.
కొన్నేళ్ళ క్రితం భక్తుల రద్దీని నియంత్రించడంలో కొన్ని లోపాలు తలెత్తాయి. అందుకని అప్పట్నుంచి కొలనులో భక్తుల స్నానాన్ని నిషేధించాము. దానికి బదులుగా పవిత్ర జలాన్ని ట్యాంకులలో నింపి స్నానాలగదులలో ఏర్పాటు చేసిన కొళాయిల ద్వారా భక్తులు స్నానమాచరించే సదుపాయాన్ని కల్పించాం. స్త్రీ, పురుషులకు స్నానాల గదులను వేర్వేరుగా నిర్మించాం" ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండిఈ నేపధ్యంలో నిజ నిర్దారణ కోసం అంబారామ్జీ అనే భక్తునితో మాట్లాడగా.. ఆయన ఏమన్నారంటే..." గత మూడేళ్లుగా నేను పక్షవాతంతో బాధపడుతున్నాను. తొమ్మిదిరోజులపాటు ఇక్కడ నివాసం ఉండడంతో నాకు కొంత ఉపశమనం కలిగింది. మూడేళ్ళ తర్వాత, నేను నా కాళ్ళపై నిలబడగలుగుతున్నాను. మాత సంపూర్ణ ఆశీస్సులతో ఈ శనివారం లేదా ఆదివారం నాటికి నేను పూర్తి ఆరోగ్యవంతుడను కాగలనన్న ప్రగాఢ విశ్వాసం నాకుంది ".