శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

శివబాబా జాతర: లక్షల మేకల బలి

WD
శివబాబా జాతర... దట్టమైన సాత్పురా అటవీ ప్రాంతంలో ప్రతి ఏటా వసంత పంచమి సందర్భంగా నిర్వహించబడుతుంది. చూసేందుకు అది మామూలు ఉత్సవంలా కనబడినా ఇందులో కొన్ని వాస్తవాలు దాగి ఉన్నాయి. ఈ కారణంగానే ఈ జాతరకు మరింత ప్రాముఖ్యత చేకూరింది. 'ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి ఖాద్వాకు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివబాబా జాతర గురించి తెలియజేయబోతున్నాం.

భక్తులు వివిధ రకాల కోర్కెలతో ఈ ఆలయానికి వస్తుంటారు. అంతేకాదు తాము కోరిన కోర్కెలు నెరవేరినందుకుగాను శివబాబాకు మేకలను బలి ఇస్తుంటారు. తమను దీవించే శివబాబా అతీత శక్తులను కలిగి ఉన్నాడని భక్తుల నమ్మకం. ఆ పరమ శివుని అవతారమే ఈ శివబాబా అని ప్రజలు భావిస్తారు. ఇదో శక్తివంతమైన ప్రాంతమని ఆలయానికి సమీపంలో నివాసముంటున్న జోగినాథ్ చెప్పాడు. కోర్కెలను నెరవేర్చుకోవాలనుకునేవారు ఎవరైనా ఒక్కసారి శివబాబాను దర్శించుకుని వాటిని సాధించుకోవచ్చు.
WD


ఇలా కోరిన కోర్కెలు నెరవేరినవారు బంధుమిత్రులతోసహా ఈ దేవాలయానికి తండోపతండాలుగా వస్తారు. తమతోపాటు తెచ్చే మేకలను వేపాకులు, పూలతో అలంకరించి శివబాబా సన్నిధికి చేరుస్తారు. పూజారి పవిత్ర జలాన్ని ఆ మేకలపై చిలకరించిన అనంతరం వాటిని శివబాబా విగ్రహానికి బలి ఇస్తారు.

WD
బలిఇచ్చిన మేకల మాంసాన్ని భుజించటం... మరింత పుణ్యాన్ని కట్టబెడుతుందని భక్తుల విశ్వాసం. ఆ మాంసాన్ని ఆ ప్రదేశం దాటి మరోచోటకు తీసుకెళ్లటానికి వారు అనుమతించరు. ఒకవేళ మాంసం మిగిలినట్లయితే పేద ప్రజలకు పంచుతారు. మొత్తం మీద ప్రతి ఏటా ఈ జాతరలో దాదాపు 2 లక్షల మేకలను భక్తులు బలి ఇస్తారని ఒకరు చెప్పారు.

రక్త మాంసాలతో తడిసే ఆ ప్రాంతంలో మనం ఒక్క ఈగను కానీ లేదా కనీసం ఓ చీమనైనా చూడలేము. అదంతా శివబాబా దీవెనల మహిమ వల్లనే సాధ్యమౌతోందని భక్తుల విశ్వాసం. ఇది తెలుసుకున్న మేము ఆ ప్రాంతాన్నంతా నిశితంగా పరిశీలించాం... చిత్రం... నిజంగానే ఒక్క ఈగకానీ... చీమకానీ మాకు కనబడలేదు.
WD


ఇక్కడ చర్చించుకోదగ్గ అంశమేమిటంటే.... అసలు మేకలను బలి ఇవ్వటం వల్ల ఏ దేవుడైనా సంతోషిస్తాడా? వెబ్‌దునియా తెలుగు వీక్షకులైన మీ నుంచి ఈ అంశంపై అభిప్రాయాలను కోరుతున్నాం... తప్పక తెలియజేస్తారు కదూ...