శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (12:38 IST)

శ్రీరామనవమి: భద్రాద్రిలో సీతరాముల కల్యాణోత్సవం.. చిలుకతో పిలుపు!

శ్రీరామనవమి పర్వదినంనాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులకు రామ చిలుకలతో ‘పిలుపును’ అందించే కార్యక్రమం వైభవంగా జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలో శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 4 రామచిలుకలను 4 వేదాలుగా పూజిస్తూ ‘శ్రీరామ’ నామాన్ని జపించారు.
 
అనంతరం ప్రత్యేకంగా ముద్రించిన కల్యాణోత్సవ శుభలేఖలను చిలుకలకు కట్టి పూజించారు. కోటి తలంబ్రాలు, మేళతాళాలతో భద్రాచలానికి కదులుతున్న విషయాన్ని రామయ్యకు తెలియజేయాలని కోరుతూ చిలుకలను గాలిలోకి విడిచారు. ప్రతియేటా చిలుకలతో పిలుపులు ఈ ప్రాంతంలో సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే.