శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 15 జూన్ 2015 (11:00 IST)

శ్రీవారి నామం ఏర్పాటులో నా బిడ్డ తప్పు లేదు.. గిట్టనివారే ఈ పని చేశారు : రమణ దీక్షితులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి నామం ఏర్పాటు విషయంలో తన కుమారుడు రాజేష్‌ దీక్షితులు తప్పు లేదని ఆలయ ప్రధాన అర్చకుడు ఏవీ రమణ దీక్షితులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో సాంబశివరావును కలిసి వివరణ ఇచ్చారు. 
 
గత శుక్రవారం మూలవర్లకు అభిషేకం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన తెల్లటి నామం అసంపూర్ణంగా ఉందని రాజేష్‌ దీక్షితులపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విమర్శల కారణంగా ఆయనను అభిషేక కైంకర్యాలకు దూరంగా ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 
 
ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవోను కలిసి వివరణ ఇచ్చారు. శ్రీవారికి నామం ఏర్పాటులో తన కుమారుడి తప్పిదం ఏమాత్రం లేదని, గిట్టనివారే ఈ పని చేసివుంటారన్నారు.