బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2016 (11:26 IST)

తిరుమల వెంకన్నకు కోటి రూపాయల విలువైన స్వర్ణ కిరీటం!

తిరుపతి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కోటి రూపాయల విలువైన స్వర్ణ కిరీటం కానుకగా అందింది. వెంకన్నకు కోయంబత్తూర్‌కు చెందిన బాలమురగన్ అపర్ణ అనే భక్తుడు రూ.కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించాడు. ముందుగా దానికి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణను కలసి కిరీటాన్ని అందజేశారు. అనంతరం భక్తుడికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 
ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ విషయాన్ని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. ఆరు రోజుల్లో స్వామివారి సేవలో 5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
 
నగరంలో ప్రతి ఏటా వైభవోత్సవాలను నిర్వహించేందుకు హర్ష టయోటా సంస్థ యాజమాన్యం ముందుకొచ్చిందని చెప్పారు. ముఖ్యంగా శుక్రవారం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలోనే హాజరయ్యారు.