శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 జనవరి 2016 (15:52 IST)

ఇకపై తెలుగులోనూ రామానుజాచార్య సీరియల్! ఎస్వీబీసీలో...!?

తమిళనాడు మాజీ సీఎం, ప్రముఖ రచయిత కరుణానిధి మాటలు రాసిన రామానుజాచార్య సీరియల్ ఇకపై తెలుగులోనూ ప్రసారం కానుంది.

హేతువాది, నాస్తికుడు అయిన కరుణానిధి.. భక్తిరసం ఉప్పొంగేలా మాటలు రాసిన ఈ సీరియల్ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ధారావాహికకు అత్యద్భుత సంభాషణలు అందించారు. తద్వారా ఈ సీరియల్‌ను త్వరలో మనం కూడా చూసే అవకాశాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ కల్పిస్తోంది. 
 
ఇందుకోసం ఇప్పటికే కలైంజర్ టీవీ ప్రతినిధులతో మంతనాలు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ సీరియల్ రైట్స్ పొందేందుకు వెంకటేశ్వర భక్తి ఛానెల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకు కరుణానిధి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.