బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మే 2016 (15:22 IST)

అభయాంజనేయస్వామి కంటనీరు.. భారీస్థాయిలో తరలివస్తోన్న భక్తులు!

ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలో వెలసిన అభయాంజనేయస్వామి కంట నీరు ధారగా కారిపోతోంది. ఆలయ పాలకవర్గం గడువు ముగియడంతో అర్చకులు ఆదివారం ఆలయాన్ని మూసేశారు. 
 
అయితే అభయాంజనేయస్వామి కంట నీరు కారడాన్ని చూసేందుకు గ్రామస్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు. ఇంకా అబయాంజనేయస్వామి కంట నీరు కారడం అశుభ సూచకమా అన్నట్లు భక్తులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.