శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (13:37 IST)

షిర్డీ సాయికి భారీ విరాళాలు: మూడేళ్లలో రూ.22.84 కోట్లు

షిరిడీలోని సాయిబాబా ఆలయానికి విరాళాలు పోటెత్తుతున్నాయి. గత మూడేళ్లలో భక్తులు రూ. 22.84 కోట్ల రూపాయలను విరాళాల రూపంలో షిరిడీ దేవుడికి సమర్పించుకున్నారని, తద్వారా భారీ విరాళాలు సాయి ఆలయానికి చేరుకున్నాయని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఈవో రాజేంద్ర జాదవ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
ఇకపోతే.. 2012-13 నుంచి 2014-15 మధ్యకాలంలో వివిధ దేశాలకు చెందిన భక్తులు నుంచి హుండీ ద్వారా రూ. 17,87,53,465, ఆన్‌లైన్ ద్వారా రూ. 4,96,93,109 విరాళాలు సమర్పించుకున్నారని రాజేంద్ర యాదవ్ వెల్లడించారు. ఈ విరాళాల్లో రూ. 5,73,46,127 మేరకు విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించిందని చెప్పుకొచ్చారు.
 
ఇంకా రూ. 5,73,46,127ల విదేశీ కరెన్సీలను హుండీ ద్వారా సాయిబాబాకు విరాళంగా అందిందని రాజేంద్ర యాదవ్ చెప్పారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.6,11,50,677ల విదేశీ కరెన్సీ విరాళంగా అందిందని ఆయన వెల్లడించారు.