శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2015 (10:11 IST)

సెప్టెంబర్‌లో బ్రహ్మోత్సవాలు... వైభవంగా నిర్వహిస్తాం: టీటీడీ ఈవో సాంబశివరావు

తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 16-24, అక్టోబర్‌ 14-22 తేదీల్లో నిర్వహించే వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్టు చెప్పారు. 
 
తిరుమల, తిరుపతిలో రోజూ 40 వేల నుంచి లక్షమంది భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనే లడ్డూ టోకెన్లు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో టీటీడీ ఆధ్వర్యంలో 10 మెగావాట్ల సౌరవిద్యుత్‌, 7.2 మెగావాట్ల పవన విద్యుత్‌ప్లాంట్లు నెలకొల్పనున్నట్లు ఈవో వివరించారు.