శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 14 మార్చి 2015 (10:10 IST)

శ్రీవారి సన్నిధిలో క్షురకుల కొరత.. కల్యాణకట్ట కిటకిట...!

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి కొండపై క్షురకుల కొరత ఏర్పడింది. దీంతో కల్యాణకట్ట వద్ద భక్తులు భారీగా క్యూ కట్టారు. తిరమల వెంకన్న దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం తలనీలాలిచ్చేందుకు కల్యాణకట్ట చేరుకున్నారు. 
 
దీంతో అక్కడ క్యూ లైన్ల పొడవు క్రమంగా పెరుగుతోంది. అయితే సరిపడినంత మంది క్షురకులు లేని కారణంగా తలనీలాలిచ్చేందుకే గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుండటంతో భక్తులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. 
 
శ్రీవారి దర్శనాన్ని నిర్దేశిత సమయంలో అందుకోలేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. రద్దీకి అనుకుణంగా ఏర్పాట్లపై దృష్టి సారించని టీటీడీ సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.