శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: మంగళవారం, 3 మే 2016 (13:44 IST)

శ్రీవారు నాకు మరో ఏడాది అవకాశం ఇచ్చారు.... సీఎం బాబు ఆ పని చేస్తారని నాకు తెలుసు... టిటిడి ఛైర్మన్‌

ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు మరిన్ని సేవలను అందించడానికి శ్రీవారు మరో యేడాది తనకు అవకాశం ఇచ్చారన్నారు టిటిడి పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి. టిటిడి పాలకమండలిని మరో యేడాది కొనసాగిస్తూ దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్‌

ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు మరిన్ని సేవలను అందించడానికి శ్రీవారు మరో యేడాది తనకు అవకాశం ఇచ్చారన్నారు టిటిడి పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి. టిటిడి పాలకమండలిని మరో యేడాది కొనసాగిస్తూ దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్‌.వి.ప్రసాద్ నుంచి జిఓ పత్రాలు ఛైర్మన్‌ చేతికి అందగానే ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు చదలవాడ. 
 
టిటిడి పాలకమండలి అధ్యక్షుడిగా మరో యేడాది సిఎం తనను పొడిగిస్తారన్న నమ్మకం తనకు ఎప్పటినుంచో ఉందని చెప్పారు చదలవాడ. గత సంవత్సర కాలంలో తమ పాలకమండలి సామాన్య భక్తులకు అవసరమైన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నామని గుర్తుచేసుకున్నారు. తిరుమలకు ఎంత రద్దీ వచ్చిన అందరికీ ఒక్కరోజులోనే దర్శనభాగ్యం కల్పిస్తున్నామంటే అదంతా తమ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలేనన్నారు టిటిడి ఛైర్మన్‌.
 
విఐపిలకు ఎప్పుడు తాను వ్యతిరేకమన్నారు. విఐపిలకు పెద్దపీట వేసే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని, ఇక మీదట కూడా తీసుకోబోమని కూడా చెప్పారు. లడ్డూ ధరను పెంచే ఆలోచన కూడా ఇప్పట్లో లేదన్నారు చదలవాడ క్రిష్ణమూర్తి.