మార్కెట్ చరిత్రలో 27 మార్కుతో సెన్సెక్స్ రికార్డు!
మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ మంగళవారం రికార్డు సాధించింది. స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 27 వేల మార్కును దాటింది. సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడి 27,019 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 55 పాయింట్ల అప్ తో 8,083 పాయింట్ల వద్ద క్లోజయింది. వచ్చే ఐదేళ్లలో భారత్లో జపాన్ పెట్టుబడులు పెడుతున్నదన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లో ర్యాలీ లాభదాయకంగా కొనసాగిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.