గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By Ganesh
Last Updated : బుధవారం, 11 జూన్ 2014 (11:00 IST)

భారత హాకీ మహిళా జట్టు జోరు.. మలేసియాపై రెండో విజయం!

మలేసియాతో జరుగుతున్న ఆరు టెస్టుల హాకీ సిరీస్‌లో భారత మహిళా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నాహకంగా మలేషియాతో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 2-0 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. దీంతో ఆరు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో అనురాధ దేవి(10నిమిషంలో)చేసిన ఫీల్డ్‌గోల్‌తో భారత జట్టు ఖాతా తెరవగా, పూనమ్‌రాణి(28ని) చేసిన గోల్‌తో 2-0తో ముందంజ వేసింది.