శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (16:42 IST)

కామన్వెల్త్ గేమ్స్: భారత్ హాకీ శుభారంభం

గ్లాస్కోలో అట్టహాసంగా ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టు తన సత్తా ఏంటో నిరూపించుకుంటోంది. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన టీమిండియా ప్రస్తుతం జాతీయ క్రీడ అయిన హాకీలోనూ శుభారంభం చేసింది. పూల్-ఎలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-1తో లౌలీ వేల్స్పై అలవోకగా విజయం సాధించింది.
 
మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు ఒక్కో గోల్ మాత్రమే చేశాయి. దీంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే ద్వితీయార్ధంలో భారత ఆటగాళ్లు విజృంభించారు. రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్నందించారు. భారత జట్టులో రఘునాథ్, ఆర్ సింగ్, గుర్వీందర్ సింగ్ ఒక్కో గోల్ సాధించి.. జట్టుకు విజయం అందించారు.