గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2015 (10:34 IST)

ఆర్చరీ వరల్డ్‌కప్‌ ఫైనల్లో అభిషేక్‌కు రజత పతకం

మెక్సికో సిటీ వేదికగా జరిగిన ఆర్చరీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఈవెంట్‌ భారత్‌కు తొలి పతకం వరించింది. భారత స్టార్ ఆర్చర్ అభిషేక్‌ వర్మ ఈ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆదివారమిక్కడ జరిగిన కాంపౌండ్‌ విభాగం ఫైనల్లో అభిషేక్‌ 143-145తో రెండో స్థానంలో నిలిచాడు.
 
 
డెమిర్‌ ఎల్మాజ్లి (టర్కీ) స్వర్ణం దక్కించుకున్నాడు. ఆర్చరీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పురుషుల విభాగంలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. కాగా మహిళల విభాగంలోనూ భారత్‌ మరో పతకంపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఆరోసీడ్‌ దీపికా కుమారి క్వార్టర్‌ ఫైనల్స్‌లో మూడోసీడ్‌ కవానక కవోరితో తలపడనుంది.