సానియాకు బంగారు పతకం - కేసీఆర్ అభినందనలు : మళ్లీ రూ.కోటి ఇస్తారా?
ఇంచియాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా.. మిక్స్డ్ డబుల్స్ టెన్నిస్ పోటీల్లో సానియా మీర్జా - సాకేత్ మైనేని జోడీ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మిక్స్డ్ ఫైనల్ పోరులో సానియా - సాకేత్ జోడీ 6-4, 6-3తో వరుస సెట్లలో చైనీస్ తైపీ ద్వయం హెసిన్ యిన్ పెంగ్ - హౌ చింగ్ చన్పై విజయం సాధించింది. ఇక ఈ విజయంతో సానియా ఆసియాడ్లో తన పతకాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది.
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి సానియా పేరు తెచ్చిందని ప్రశంసించారు. ఇంచియాన్లో రెండు పతకాలతో కలిపి మొత్తం 8 ఆసియాడ్ మెడల్స్ సాధించిన సానియా.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
ఈ విజయంతో సానియా మీర్జాకు కేసీఆర్ ప్రభుత్వం మరో కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తుందా అనే గుసగుసలు వినొస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు భారీ నగదు బహుమతిని కేసీఆర్ స్వయంగా అందజేయగా, వీటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగిన విషయం తెల్సిందే.