మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (11:39 IST)

ఆసియా గేమ్స్ : కబడ్డీ ఫైనల్లో భారత ప్లేయర్స్ అదుర్స్!

ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల మెరుగైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా గురువారం కబడ్డీ విభాగంలో భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా ఫైనల్స్ చేరింది. దీంతో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరడం ఖాయమైంది. 
 
ఫైనల్స్‌లో రెండు జట్లు విజయం సాధిస్తే, రెండు బంగారు పతకాలు భారత్ ఖాతాలో చేరుతాయి. పరాజయం పాలైనా రెండు వెండి పతకాలు ఖాయం. ప్రస్తుతం పతకాల పట్టికలో 11వ స్థానంలో ఉన్న భారత్ ఖాతాలో ఏడు బంగారు పతకాలతో పాటు 9 వెండి, 34 కాంస్య పతకాలున్నాయి.