సచిన్తో కలిసి భారత సాకర్ను అభివృద్ధి చేస్తాం!
భారత్లో సాకర్పై ఫిఫా ఇటీవల ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వంటి ఛాంపియన్షిప్ల నిర్వహణకు మార్గదర్శనం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక లీగ్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఓ జట్టును సొంతం చేసుకున్నాడు.
సాకర్ను ఎంతగానో అభిమానించే సచిన్ కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. కాగా, తన జట్టు కోసం సచిన్ ఇంగ్లండ్ మాజీ గోల్ కీపర్ డేవిడ్ జేమ్స్ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించాడు. జేమ్స్ ఈ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్కు ఆటగాడిగానూ, కోచ్గానూ వ్యవహరిస్తాడు.
దీనిపై జేమ్స్ మాట్లాడుతూ, ఐదారువారాల క్రితం సచిన్తో సంభాషించానని తెలిపాడు. సాకర్ పై ఇరువురం అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలను పంచుకున్నామని, సచిన్ ఓ అద్భుతమైన వ్యక్తి అని పేర్కొన్నాడు. తానేమీ క్రికెట్ ఫ్యాన్ కాదని, సచిన్తో భేటీ సందర్భంగా క్రికెట్ కంటే ఫుట్ బాల్ పైనే ఎక్కువగా మాట్లాడుకున్నామని వివరించాడు.