శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (18:37 IST)

దీపికా పల్లికల్‌కు కాంస్యం.. రూ. 20లక్షల నజరానా!

17వ ఆసియా క్రీడల్లో భాగంగా సోమవారం జరిగిన స్క్వాష్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో భారత్ స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఓటమి చవిచూసింది. మలేషియాకు చెందిన నికోలస్ డేవిడ్ చేతిలో 4-11, 4-11, 5-11 తేడాతో దీపికా సెమీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సెమీస్‌లో ఓటమి పాలైనప్పటికీ... దీపిక కాంస్యాన్ని ఖరారు చేసుకుంది.
 
ఇకపోతే.. ఆసియా క్రీడల్లో స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత దేశానికి కాంస్యపతకం అందించిన దీపికా పల్లికల్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.20 లక్షల రూపాయలను నజరానాగా ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దీపికకు లేఖ రాశారు. దీపిక పతకం సాధించడం తమిళనాడుకు గర్వకారణమని లేఖలో ఆమె పేర్కొన్నారు. దేశ కీర్తిని ఇనుమడింప చేసినందుకు తమిళ ప్రజల తరపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నానని ఆమె లేఖ ద్వారా తెలిపారు.