హాకీ ఇండియా లీగ్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు!
హాకీ ఇండియా లీగ్ పేరిట రంగ ప్రవేశం చేయనున్న కొత్త లీగ్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు అడుగుపెట్టనుంది. కొత్త లీగ్లో ప్రవేశించిన ధోని, రాంచీ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు.
సహారా అడ్వెంచర్స్ స్పోర్ట్స్తో కలిసి ధోనీ ఆ జట్టును కొనుగోలు చేశాడు. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్లో చెన్నై జట్టు సహ యజమానిగా కొనసాగుతున్న ధోనీ తాజాగా హాకీ లీగ్లోనూ కాలుమోపాడు.