శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 మే 2016 (13:34 IST)

ఫ్రెంచ్ ఓపెన్‌లో సాన్‌టీనా జోడీకి చుక్కెదురు.. క్వార్టర్స్‌లో రోహన్ బోపన్న, పేస్ జోడీ!

గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గెలుచుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. వరుసగా నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలనుకున్న సానియా మీర్జా- మార్టినా హింగిస్ జంటకు ఫ్రెంచ్ ఓపెన్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 3-6, 2-6తో క్రెజ్‌సికోవా-సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో పరాజయం పాలైంది. 
 
ఇతపోతే.. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-కుద్రయెత్సెవా (రష్యా) జంట 6-2, 3-6, 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)-హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఖంగుతిన్నాడు. 
 
ఇక పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలండ్) 7-6 (7/5), 7-6 (7/4)తో జేమీ ముర్రే (బ్రిటన్)-బ్రూనో సొరెస్ (బ్రెజిల్)లపై… రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) 6-2, 6-7 (4/7), 6-1తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్)లపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.