శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (14:55 IST)

నేను నచ్చలేదో? లేక నా ఫేస్ నచ్చలేదో? గానీ పనిగట్టుకుని?

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా పుల్లెల గోపిచంద్ అకాడమీని ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. ప్రైవేట్ అకాడమీకి నిధులిస్తూ.. వాటిని ఎంకరేజ్ చేయడం ఎంటని పరోక్షంగా గోపిచంద్ అకాడమీపై ఫైర్ అయ్యింది. బ్యాడ్మింటన్‌లో ఎంతో రాణిస్తున్నప్పటికీ... ఒలింపిక్ టాప్ స్కీంకు తన పేరును ప్రతిపాదించకపోవడం ఎంతో బాధ కలిగించిందని గుత్తా జ్వాలా వ్యాఖ్యానించింది. 
 
రెండు రోజుల క్రితం కెనడాలో జరిగిన కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో తన భాగస్వామి అశ్విని పొన్నప్పతో కలిసి సత్తా చాటుకున్న గుత్తా జ్వాల.. కేవలం 35 నిమిషాల్లోనే తన ప్రత్యర్థులను మట్టికరిపించి టైటిల్ గెలుచుకుంది. అందచందాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం.. వివాదాల్లో నిలవడం గుత్తా జ్వాలా కామనైపోయింది. కోర్టులోనే కాకుండా కోర్టు బయట కూడా తన ప్రత్యర్థులపై విరుచుకుపడటం జ్వాలాకు సాధారణం. 
 
ఈ క్రమంలో, మరోసారి తీవ్ర ఆరోపణలు చేస్తూ జ్వాల వార్తల్లోకెక్కింది. "నేను నచ్చలేదో? లేక నా ఫేస్ నచ్చలేదో? పనిగట్టుకుని నాపై రాజకీయాలు చేస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గోపిచంద్ అకాడమీపైనే జ్వాలా విమర్శలు గుప్పించిందని క్రీడా పండితులు అంటున్నారు.