ప్రణయ్ని వరించిన ఇండోనేషియా గ్రాండ్ ప్రీ టైటిల్!
ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ను భారత ప్లేయర్ ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన అతను 43 నిమిషాలు జరిగిన తుది పోరులో స్థానిక ఫేవరిట్ ఫిర్మన్ అబ్దుల్ కొలిక్ను 21-11, 22-20 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలి టైటిల్ సాధించిన అతను గత వారం హోచిమిన్ సిటీలో జరిగిన వియత్నామ్ గ్రాండ్ ప్రీలో రన్నరప్గా నిలిచాడు.
ఇండోనేసియా మాస్టర్స్లో అద్వితీయ ప్రతిభ కనబరిచి టైటిల్ను సొంతం చేసుకున్నాడు 2010 సమ్మర్ యూత్ ఒలింపిక్స్ బాయిస్ సింగిల్స్లో రజత పతకం సాధించిన ప్రణయ్ సీనియర్స్ విభాగంలోనూ రాణించడమేగాక, కెరీర్లో మొదటి టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు.