హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16వ దక్షిణ మండలం పురుషుల, మహిళల క్యారమ్ చాంపియన్షిప్ ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు బికె హర్నాథ్ బాబా తెలిపారు.
మంగళవారం ఎపి ఒలింపిక్ భవన్లో జరిగిన విలేఖరుల సమావేశంలో చాంపియన్షిప్ ఏర్పాట్ల గురించి వివరించారు. మూడు రోజులపాటు జరిగే ఈ చాంపియన్షిప్ కొంపల్లిలోని శివశివాని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆవరణలో నిర్వహిస్తున్నారు.
తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఆంధ్రా, కర్ణాటక, హైదరాబాద్కు చెందిన జట్లు ఈ చాంపియన్షిప్లో పాల్గొంటాయి. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించిన పలువురు క్రీడాకారులు ఈ చాంపియన్షిప్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.
Copyright 2024, Webdunia.com