గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (16:23 IST)

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ పతకాల పంట: బింద్రా చివరి గేమ్!

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. తన చివరి గేమ్స్ ఇవేనని ప్రకటించిన షూటర్ అభినవ్ బింద్రా శుక్రవారం జరిగిన పోటీల్లో స్వర్ణ పతకం సాధించాడు. బింద్రాతోపాటు మలైక గోయల్, తెలుగుతేజం సంతోషి మత్సలు గేమ్స్ పతకాలు సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంతోషి 53కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
 
తొలి రోజునే ఏడు పతకాల సాధించిన భారత క్రీడాకారులు, తర్వాతి రోజు మూడు పతకాలు గెలుపొందారు. అభినవ్ బింద్రాకు ఇది చివరి కామన్వెల్త్ గేమ్స్ కాగా, కామన్వెల్త్ గేమ్స్‌లో మలైకా తొలిసారి పాల్గొనడం గమనార్హం. వీరిద్దరూ కూడా పతకాలు సాధించడం విశేషం. 10ఎం ఎయిర్ పిస్టోల్ విభాగంలో మలైకా వెండి పతకాన్ని సాధించింది.