ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ : బాక్సర్ సర్జుబాలాకు రజతం!
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భాగంగా భారత్కు రజతం దక్కింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భాగంగా బాక్సర్ విభాగంలో సర్జుబాలా దేవీ రజతంతో సరిపెట్టుకుంది.
మహిళల లైట్ ఫ్లై వెయిట్ 48 కేజీల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో థాయ్ లాండ్ తైపీకి చెందిన చుతామత్ రాక్ సాత్ను ఓడించి సర్జుబాలా ఫైనల్కు చేరింది. అయితే ఫైనల్లో పోరులో చతికిలబడ్డ సర్జుబాలా రజతంతో సరిపెట్టుకుంది.