కెనడా ఓపెన్ టోర్నీ : టైటిల్ దిశగా గుత్తా జ్వాల - అశ్వినీ జోడీ
కెనడాలోని కాల్గరీ వేదికగా జరుగుతున్న కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ షట్లర్ గుత్తా జ్వాల - అశ్వినీ పొన్నప్పల జంట సెమీస్లో అడుగుపెట్టింది. దీంతో సెమీస్ పోరులో జపాన్కు చెందిన షిహో తనాకా - కొహరు యోనెమోటో జంట గుత్తా జ్వాల జోడీ తలపడనుంది.
అంతకుముందు శనివారం జరిగిన క్వార్టర్ఫైనల్లో మూడో సీడ్ జ్వాల - అశ్వినీల ద్వయం 21-19, 21-13 స్కోరుతో హాంకాగ్కు చెందిన చాన్ కాకా టెజ్ కా - యన్ సిన్ ఇంగ్ జంటపై విజయభేరీ మోగించింది. మరోవైపు.. ప్రద్న్యా గాద్రె - సిక్కి రెడ్డి ద్వయంతోపాటు సింగిల్స్లో సాయి ప్రణీత్, అజయ్ జయరామ్లు క్వార్టర్స్లో ఓడి ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.