సానియా మీర్జాకు ఖేల్ రత్నపై స్టే విధించిన కర్ణాటక హైకోర్టు
హైదరాబాదీ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు ప్రకటించిన రాజీవ్ ఖేల్ రత్నపై స్టే విధించింది. అంతేగాకుండా ఈ వ్యవహరంపై కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది. అవార్డుకు సంబంధించిన నియమావళి ప్రకారం అన్ని అర్హతలు తనకున్నాయని.. కానీ క్రీడా మంత్రిత్వ శాఖ తనను పట్టించుకోలేదని పారా ఒలింపియన్ గిరీశ నాగరాజె గౌడ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ అవార్డుకు కావాల్సిన అర్హతలన్నీ తనకున్నప్పటికీ తనను క్రీడా మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదని పిటిషన్లో గిరీశ ఆవేదన వ్యక్తం చేశాడు. పాయింట్ల పరంగా సానియా తనకు దరిదాపుల్లో కూడా లేదని పేర్కొన్నాడు. 'రాజీవ్ ఖేల్ రత్న' ఎంపికలో తనకు అన్యాయం జరిగిందంటూ గిరీశ వాపోయాడు. దీంతో సానియా మీర్జాపై ప్రకటించిన ఖేల్ రత్నపై కోర్టు స్టే విధించింది.