భారత చెస్ ఛాంపియన్ కోనేరు హంపి వధువుగా మారనుంది. ఈమెకు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, ఎఫ్ట్రానిక్స్ అధినేత దాసరి రామకృష్ణ కుమారుడు అన్వేష్తో ఆగష్టు 13న వివాహం కానుంది. వీరి నిశ్చితార్థం ఈ నెల 22న జరిగింది. ఈ పెళ్లి సంగతులను హంపి మీడియా సమావేశంలో వెల్లడించింది. వివాహమైనా చెస్ను కొనసాగిస్తానని, ప్రపంచ ఛాంపియన్ కావాలన్నదే తన లక్ష్యమని హంపి చెప్పింది.