శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (19:10 IST)

క్రికెటర్ అతుల్ శర్మ చంపేస్తానని బెదిరిస్తున్నాడు : లియాండర్ పేస్ ఫిర్యాదు!

క్రికెటర్ అతుల్ శర్మ తనను, తన కుమార్తెను చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ ప్రముఖ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ ఆరోపించాడు. ఇదే అంశంపై ఆయన ముంబై నగర పోలీసు కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో ఒకప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తరపున ఆడిన అతుల్ శర్మకు పేస్ మాజీ భార్య రియా పిళ్లైతే వివాహేతర సంబంధం ఉన్నట్టు ప్రచారం ఉంది. 
 
గత కొంతకాలం నుంచి విడిగా ఉంటున్న పేస్, రియాలు కుమార్తె విషయంలో ముంబై స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. కూతురు రక్షణ బాధ్యత తనకే అప్పగించాలని పేస్ కోరాడు. కుమార్తెను తనకే అప్పగించాలని అటు రియా కూడా కోరుతోంది.
 
ఈ విషయంలో అతుల్ శర్మ జోక్యం చేసుకుని రియా పిళ్లైకు అండగా నిలిచి లియాండర్ పేస్‌కు బెదిరింపులు చేస్తున్నట్టు సమాచారం. దీంతో అతుల్ శర్మపై పేస్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.