గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (09:30 IST)

కామన్వెల్త్ క్రీడలు : వెయిట్ లిఫ్టర్ సంజితా చానుకు బంగారు పతకం

గ్లాస్గో వేదికగా జరుగుతున్న 20వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్ సంజతా చాను బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇది భారత్‌కు తొలి బంగారు పతకం. తొలి రోజు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 6 కేటగిరీల్లో పతకం కోసం పోటీలు నిర్వహించగా భారత్ 4 పతకాలతో సత్తా చాటింది. వాటిలో రెండు స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. మహిళల 173 కిలోల విభాగంలో సంజితా చాను పసిడి సాధించగా, సైకోమ్ చాను రజితం దక్కించుకుంది. 
 
అలాగే, పురుషుల 56 కిలోల కేటగిరీలో సుఖేన్ డే స్వర్ణం చేజిక్కించుకోగా, అదేవిభాగంలో గణేశ్ మాలి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. సంజితా 173 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తన సత్తా చాటి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది అలాగే, 170 కేజీల విభాగంలో మీరాభాయ్ వెండి పతకాన్ని తన వశం చేసుకుంది.