బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:12 IST)

ప్రియురాలు అలిగిందని ప్రియుడు ఏం చేశాడో తెలుసా?

కొంతమంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అదే ప్రేమికుల్లో ప్రియుడో.. ప్రియురాలో దూరమైతే మాత్రం తట్టుకోలేరు. తిరిగి దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. తాజాగా అలాంటి

కొంతమంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అదే ప్రేమికుల్లో ప్రియుడో.. ప్రియురాలో దూరమైతే మాత్రం తట్టుకోలేరు. తిరిగి దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది.
 
మహారాష్ట్రలోని పింపరీ చించవఢ్‌ ప్రాంతానికి చెందిన నిలేశ్‌ ఖేడికర్‌ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని అమితంగా ఇష్టపడింది. అయితే, వారిద్దరి మధ్యా అనుకోకుండా చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ప్రియురాలు అతనికి దూరమైంది. ఆ తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకున్న ప్రియుడు... వినూత్నంగా క్షమాణ చెప్పి ప్రేయసి కోపాన్ని తగ్గించాలని భావించాడు. 
 
అనుకున్నదే తడవుగా.. పిపరీ చించవఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో మాట్లాడి రూ.72 వేలు ఖర్చు చేసి తన స్నేహితుడి సాయంతో రోడ్డు పొడవున ఏకంగా 300 హోర్డింగులు పెట్టాడు. ఈ హోర్డింగ్‌లలో 'నన్ను క్షమించు.. నన్ను క్షమించు'.. అంటూ తన ప్రియురాలు ప్రయాణించే మార్గంలో 300 హోర్డింగులు కట్టాడు. వీటిని చూసిన ఆ ప్రియురాలు.. తన ప్రియుడి చర్యకు ఫిదా అయిపోయి అతన్ని క్షమించేసింది. 
 
అయితే వాటిలో కొన్నింటికి అనుమతి లేదంటూ కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఖేడికర్‌తో పాటు అతని స్నేహితుడని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానికుల చర్యతో హోర్డింగుల్లో ప్రియురాలిని క్షమాపణలు వేడుకున్న నిలేశ్‌ ఇప్పుడు అవే క్షమాపణలు నేరుగా పోలీసులనే వేడుకోవలసి వస్తోంది.