శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 జులై 2017 (16:34 IST)

ఆ జాబితాలో ప్రభాస్‌కు ఆరో స్థానం.. పీవీ సింధుకు అగ్రస్థానం...

భారతదేశంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ స్థానం సంపాదించుకున్నాడు. ప్రభాస్‌తో పాటు తెలుగుతేజం.. రియో ఒలింపిక్స్ రజత పతక వి

భారతదేశంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ స్థానం సంపాదించుకున్నాడు. ప్రభాస్‌తో పాటు తెలుగుతేజం.. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు.. జీక్యూ ఇండియా మేగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావితమైన 50 మందితో కూడిన భారతీయుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో ప్రభాస్, సింధూలకు మాత్రమే చోటు దక్కడం గమనార్హం.
 
ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలైన 22 ఏళ్ల పీవీ సింధూ అగ్రస్థానంలో నిలిచింది. ఇక బాహుబలి హీరో ప్రభాస్ ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.  ఈ జాబితాలో నటీమణిగా రాధికా ఆప్టే పదో స్థానంలో నిలిచింది. ఇక ఇదే జాబితాలో సీఎం కేసీఆర్ జీవిత చరిత్రలో కేసీఆర్ రోల్‌లో కనిపించనున్న వ్యక్తి రాజ్‌కుమ్మర్ రావుకు ఏడో స్థానం, కమెడియన్ కరణ్ గిల్ నాలుగో స్థానంలో, వాణిజ్య వేత్త సంజయ్ గార్జ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.