శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (19:25 IST)

రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!

2016వ సంవత్సరంలో జరుగనున్న రియో ఒలింపిక్స్‌లో క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం తెచ్చిన క్రీడాకారులకు 75 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. 
 
క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్ అవార్డుల పథకాన్ని పునఃసమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొవాలని భావించే క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు కేంద్రం ఈ నిర్ణయం వెల్లడించింది.