బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2016 (22:07 IST)

సింధు, సాక్షి, దీపలకు రాష్ట్రపతి చేతులు మీదుగా ఖేల్ రత్న అవార్డులు

భారతదేశ క్రీడా పురస్కారాల్లో అత్యున్నతమైన ఖేల్ రత్న పురస్కారాలను పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా క్రీడల్లో రాణించిన వారికి ఢిల్లీలో ఖేల్ రత్న పురస్కార అవార్డుల కార్యక్రమం జరిగింది.

భారతదేశ క్రీడా పురస్కారాల్లో అత్యున్నతమైన ఖేల్ రత్న పురస్కారాలను పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ అందుకున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా క్రీడల్లో రాణించిన వారికి ఢిల్లీలో ఖేల్ రత్న పురస్కార అవార్డుల కార్యక్రమం జరిగింది. 
 
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగుతేజం బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధుతోపాటు రెజ్ల‌ర్ సాక్షి మాలిక్‌, జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్‌, షూట‌ర్ జీతూ రాయ్‌లకు రాజీవ్ గాంధీ ఖేల్‌ర‌త్న అవార్డులను ప్రదానం చేశారు. వీరందరికీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరిగింది. ఖేల్‌రత్న విజేతలకు పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.7.5 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు. బహుమతి కార్యక్రమానికి సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు హాజరయ్యారు.