తెలుగు టైటాన్స్ జైత్ర యాత్ర: పాయింట్ల పట్టికలో రెండో స్థానం!
ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఇప్పటికే లీగ్లో నాలుగు వరుస విజయాలు సాధించిన ఈ జట్టు గురువారం రాత్రి పాట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్లోనూ విజయదుందుభి మోగించింది. తాజా విక్టరీతో తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
గురువారం హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్, పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అయితే ఆ తర్వాత తెలుగు టైటాన్స్ క్రమం తప్పకుండా ఒత్తిడి పెంచడంతో పాట్నా పైరేట్స్కు పరాజయం తప్పలేదు.
34-22 స్కోరుతో తెలుగు టైటాన్స్ గెలుపును నమోదు చేసుకుంది. ఆద్యంతం మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన తెలుగు టైటాన్స్.. ప్రత్యర్థిపై ధీటుగా రాణించి గెలుపును సొంతం చేసుకుంది.