ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ : సింగిల్స్ క్వార్టర్స్లోకి ఎంట్రీ!
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్, పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ కూడా క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాకు.
సిరీస్ ప్రారంభం నుంచే సంచలన ఆటతీరుతో ముందుకెళుతున్న కశ్యప్, గురువారం రాత్రి జరిగిన పోటీలో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తియాన్ హౌవీని 21-19, 21-18తో వరుస గేముల్లో మట్టి కరిపించి క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్, స్కాట్లాండ్ కు చెందిన కిర్ స్టీ గిల్మోర్ ను ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.