ఆసియా బ్యాడ్మింటన్: సైనా బాటలోనే సింధు.. క్వార్టర్స్తోనే ఓవర్!
చైనాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పోరాటం ముగిసింది. వరల్డ్ నెంబర్ వన్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్తోనే సరిపెట్టుకోగా, భారత ఆశాకిరణం పీవీ సింధు కూడా సైనా బాటలోనే పయనించింది. ప్రత్యర్థిపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంలో సైనా విఫలమైన చందంగానే.. పీవీ సింధు కూడా ప్రత్యర్థి చేతిలో సింగిల్స్ క్వార్టర్స్లో పరాజయం మూటగట్టుకుంది.
ఆసియా బ్యాడ్నింటన్ టోర్నీ టాప్ సీడ్, ఒలింపిక్ చాంప్ లి జురుయ్ చేతిలో సింధు 21-11, 19-21, 8-21తో ఓటమిపాలైంది. చివరి రెండు గేముల్లో లి జురుయ్ ధాటికి సింధు నిలవలేకపోయింది. సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండడంతో చైనా అమ్మాయిలు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు. దీంతో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్తాచాటుకోలేకపోతున్నారు.