సైనా నెహ్వాల్కు మళ్లీ నెం.1 ర్యాంకు : ఆస్ట్రేలియా ఓపెన్లో రాణిస్తుందా?
భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సైనా నెహ్వాల్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత నెల మొదట్లో కెరీర్లో తొలిసారి నెం.1 ర్యాంక్ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న మొదలయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ ముందు అగ్రస్థానం దక్కించుకోవడం సైనా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న సైనా.. తొలి పోరులో క్వాలిఫయర్తో తలపడనుంది. కాగా, మరో స్టార్ షట్లర్ పీవీ సింధు ఒక స్థానం దిగజారి 12వ ర్యాంక్లో నిలిచింది. ఇక పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నాలుగో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్లు 13, 15 ర్యాంక్లను నిలబెట్టుకున్నారు.