శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (17:43 IST)

సానియా మీర్జా చీపురు పట్టింది.. చెత్త ఎత్తింది.. స్వచ్ఛ్ భారత్ కోసం..

హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా చీపురు చేతబట్టి వీధులు ఊడ్చి చెత్తను ఎత్తింది. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ పనులు చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో సానియా చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. 
 
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, షూటర్ అభినవ్ బింద్రాలను సానియా ఆహ్వానించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సానియా పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విన్నపం మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ సవాల్ మేరకు టెన్నిస్ తార సానియా మీర్జా ఈ కార్యక్రమంలో పాల్గొంది.