చైనా ఓపెన్ టైటిల్కు ఒకడుగు దూరంలో సానియా మీర్జా జోడీ!
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ మరో టైటిల్కు ఒకడుగు దూరంలో నిలిచింది. ప్రపంచ నెం.1 సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ ఈ టెన్నిస్ సీజన్లో ఎనిమిదో టైటిల్ను చేజిక్కించుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది. వింబుల్డన్ ఓపెన్లో అదరగొట్టిన ఈ జంట చైనా ఓపెన్ సెమీఫైనల్లోనూ ప్రత్యర్థి జంటపై మెరుగ్గా రాణించింది. తద్వారా చైనా ఓపెన్లో ఈ ఇండో-స్విస్ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది.
శుక్రవారం జరిగిన సెమీస్లో టాప్సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-2, 6-3తో వరుస సెట్లలో వైల్కార్డ్ ఎంట్రీ చెన్ లియంగ్-యఫన్ వాంగ్ (చైనా) ద్వయంపై సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా టైటిల్ పోరుకు రెడీ అయ్యింది. ఇక టైటిల్ పోరులో హౌచింగ్ చాన్-యంగ్ జన్ చన్ (చైనీస్ తైపీ) జోడీతో మీర్జా ద్వయం పోటీపడనుంది.