సత్తా చాటిన సానియా-హింగిస్ జోడీ: ఖాతాలో వుహాన్ డబుల్స్ టైటిల్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ మళ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీ ప్రత్యర్థి జంటకు చుక్కలు చూపించింది. ఆద్యంతం ప్రత్యర్థి జంటను ఆటాడుకుంది. తద్వారా సానియా- హింగిస్ జోడీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్ టైటిల్ను సానియా జంట సొంతం చేసుకుంది.
మహిళల డబుల్స్ పైనల్లో రుమేనియాకు చెందిన ఇరీనా కామెలియా బెగూ-మోనికా నికెలస్కూ జోడీతో తలపడిన సానియా జంట 6-2, 6-3 తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సానియా-హింగిస్ జోడీని ఈ సంవత్సరం ఏడవ విజయం వరించినట్లైంది. అలాగే ఈ ఏడాది వింబుల్డన్ నుంచి కొనసాగుతున్న సానియా-హింగిస్ జోడీనే అత్యుత్తమ జోడీగా పేరొందింది.